poulomi avante poulomi avante

సింటెక్స్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు వెల్స్పన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తన సబ్సిడరీ సంస్థ అయిన సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమాన్ని చంద‌న్ వెల్లిలో నిర్వహించింది. మంత్రి కే తారక రామారావు, వెల్స్పన్ వరల్డ్ చైర్మన్ బి కే గోయోంకా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సింటెక్స్ సంస్థ 350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ యూనిట్ వలన వెయ్యి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. వాటర్ ట్యాంకులను, యూపీవీసీ పైపులు మరియు ఇతర అనుబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నది.

తెలంగాణలో నూతన యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, అద్భుతమైన మౌలిక వసతుల వల్లనే అనేక సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని వెల్స్పన్, వరల్డ్ చైర్మన్ బి కే గోయాంక తెలియజేశారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles