poulomi avante poulomi avante

రూ.17 కోట్లతో ఇల్లు కొన్న ప్రీతీ జింటా

ప్రముఖ నటి ప్రీతీ జింటా ముంబై పాలి హిల్ ప్రాంతంలో రూ.17 కోట్లు వెచ్చించి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రుస్తుంజీ పరిశ్రమ్ సూపర్ ప్రీమియం ప్రాజెక్టులో 11వ అంతస్తులోని ఫ్లాట్ ను ఆమె తీసుకున్నారు. 1721 చదరపు అడుగుల ఏరియా ఉన్న ఆ ఫ్లాట్ కు 90 చదరపు అడుగుల రెండు పార్కింగ్ స్లాట్స్ కూడా అదనంగా లభిస్తాయి.

చదరపు అడుగుకు రూ.1.15 చొప్పున 1474 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు దాదాపు రూ.17 కోట్లు చెల్లించారు. స్టాంపు డ్యూటీ కింద రూ.85 లక్షలు చెల్లించారు. కాగా, దాదాపు అర ఎకరం స్థలంలో 22 అంతస్తులతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ప్రీతీ జింటా నేరుగా రుస్తుంజీ గ్రూప్ నుంచే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. కాగా, బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ కూడా ఇదే టవర్ లో 7800 చదరప అడుగుల లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను రూ.103 కోట్లకు సొంతం చేసుకున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles