poulomi avante poulomi avante

రూ.10.5 కోట్లతో ఫ్లాట్ కొన్న క్రికెటర్ పృథ్వీ షా

భారత క్రికెటర్ పృథ్వీ షా ముంబై బాంద్రాలో ఓ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.10.5 కోట్లు వెచ్చించి ఈ ఖరీదైన ఫ్లాట్ సొంతం చేసుకున్నాడు. 2,209 చదరపు అడుగుల కార్పెట్, 1654 చదరపు అడుగుల టెర్రస్ తో 81 ఔరేట్ టవర్ లోని 8వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. ఒప్పందంలో భాగంగా మూడు పార్కింగ్ స్లాట్లు కూడా షా సొంతమయ్యాయి. స్టాంప్ డ్యూటీ కింది రూ.52.5 లక్షలు చెల్లించగా.. గతనెల 28న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తయింది.

పిరమిడ్ డెవలపర్స్ అండ్ అల్ట్రా లైఫ్ స్పేస్ నుంచి షా ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దీనిపై షాను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా, 2018 ఫిబ్రవరిలో షా కెప్టెన్సీలో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించింది. అదే ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం షా ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles