poulomi avante poulomi avante

ప్లాట్ల అమ్మకంతో వీఎంఆర్డీఏకు రూ.11 కోట్లు

ప్లాట్ల అమ్మకం ద్వారా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ)కి రూ.11.3 కోట్ల ఆదాయం వచ్చింది. విశాఖలోని వివిధ లేఔట్లలో 28 ఖాళీ ప్లాట్లకు వీఎంఆర్డీఏ వేలం నిర్వహించింది. ఇందులో 11 ప్లాట్లు అమ్ముడుకాగా, సంస్థకు రూ.11.3 కోట్ల ఆదాయం వచ్చింది. 28 ప్లాట్లకు ఫిబ్రవరి 9న వేలం నిర్వహించారు. ఇందులో 11 ప్లాట్లకు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా బిడ్లు దాఖలయ్యాయి. కూర్మన్నపాలెంలోని ప్లాట్ కు చదరపు గజానికి రూ.35వేల ధర నిర్ణయించగా.. అది చదరపు గజం రూ.65,300 పలికింది. అలాగే కుమ్మరిపాలెంలోని ప్లాట్ కు చదరపు గజం ధర రూ.20,000 నిర్ధారించగా.. రూ.28,500 వచ్చింది. ఈ ప్లాట్లు హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ సహా వివిధ కేటగిరీలకు చెందినవి. కాగా, హైకోర్టు ఆదేశాల కారణంగా ఒక ప్లాట్ ను వేలం నుంచి మినహాయించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles