poulomi avante poulomi avante

హైదరాబాద్ లో గజం రూ.3 లక్షలు

హౌసింగ్ బోర్డు వేలంలో రికార్డు స్థాయిలో పలికిన ధర

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిందంటూ వస్తున్న అంచనాలు తప్పని నిరూపించే లావాదేవీ జరిగింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన వేలంలో ఓ ప్లాట్ రికార్డు స్థాయి ధర పలికింది. గజం రూ.2.98 లక్షలకు అది అమ్ముడై ఔరా అనిపించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు బుధవారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-7లోని 18 ఖాళీ ప్లాట్లకు వేలం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్లాట్ నెంబర్ 22 రికార్డు స్థాయిలో గజం రూ.2.98 లక్షల ధర పలికింది.

ఈ వేలం ద్వారా బోర్డుకు రూ.142.78 కోట్ల ఆదాయం సమకూరినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. 18 ప్లాట్లలోని 6,232 గజాల భూమికి వేలం నిర్వహించామని.. సగటున గజం ధర రూ.2.38 లక్షలు పలికిందని తెలిపారు. వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు రెండు రోజుల్లోగా నాలుగింట ఒక వంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల వరకు ఉన్న 18 ప్లాట్లను వేలం వేయగా.. ప్లాట్ నెంబర్ 22కి రికార్డు ధర వచ్చిందని వివరించారు. మొత్తం 84 మంది వేలంలో పాల్గొన్నారని తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles