జి స్క్వేర్ సీఎండీ బాలా రామజెయం
హైదరాబాద్ రియల్ రంగంలో క్యాష్ కాంపోనెంట్ ఎక్కువని జీ స్క్వేర్ గ్రూప్ ఛైర్మన్ బాలా రామజెయం తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన జీ స్వ్కేర్ సెవెన్ హిల్స్ ప్రాజెక్టు లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హైదరాబాద్లో భూముల మార్కెట్ విలువకు అమ్మకపు ధరకు భారీ వ్యత్యాసం ఉందని.. అందుకే, అక్కడ వ్యాపారం చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
ALSO READ: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్త ఆకాశహర్మ్యం..
కోయంబత్తూరులో 714 ఎకరాల్లో సెవెన్ హిల్స్ ప్రాజెక్టును ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మొదటి ఫేజులో 406 ఎకరాల్ని అభివృద్ధి చేస్తున్నామని.. ఇందులో రెరా అనుమతి పొందిన 3,127 ప్లాట్లు ఉంటాయని వెల్లడించారు. మిగతా 308 ఎకరాల్లో విల్లాలు, అపార్టుమెంట్లను డెవలప్ చేసేందుకు జాయింట్ వెంచర్ల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రత్యేకంగా సిగ్నేచర్ విల్లాలను నిర్మిస్తున్నామని.. మహేంద్రసింగ్ ధోని తమకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు.