Categories: LATEST UPDATES

స‌మంత ఆవిష్క‌రించిన ‘ద టేల్స్ ఆఫ్ గ్రీక్‌’

అక్కినేని స‌మంత ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్టును ప్రారంభించింది. పలువురు సెలబ్రిటీలు, ప్ర‌ముఖులు, ప్ర‌త్యేక ఆహ్వానితుల స‌మ‌క్షంలో హైటెక్ సిటీ లోని నోవోటెల్ హోటల్లో ఆదివారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ప్రాజెక్టులో లగ్జ‌రీ సూట్లు, స్టూడియో అపార్టుమెంట్ల‌ను సుచిరిండియా సంస్థ నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. గ్రీకు సంప్ర‌దాయంతో పాటు అత్యాధునిక స‌దుపాయాలతో ఈ ప్రాజెక్టును భిన్నంగా నిర్మిస్తామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

This website uses cookies.