poulomi avante poulomi avante

బహదూర్ పల్లి, తొర్రూర్ లే అవుట్లలో ప్లాట్ల వేలం

* బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్ లో 223 ప్లాట్లు
* నేడు బహదూర్ పల్లి ప్రీ బిడ్ సమావేశం
* 25న తొర్రూర్​ ప్రీబిడ్​ సమావేశం
* మార్చి మూడో వారంలో ఈ –ఆక్షన్​ షురూ

హైదరాబాద్​: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బహదూర్​ పల్లి(మేడ్చల్ మల్కాజ్​ గిరి జిల్లా), తొర్రూరు(రంగారెడ్డి జిల్లా) లోని ప్లాట్లను ఆన్​ లైన్​ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టిసి ఆధ్వర్యంలో వేలం(ఈ –ఆక్షన్​)​ ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్​ఎండిఏ) సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్​ జోన్​ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను హెచ్​ఎండిఏ పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నది. బహదూర్​ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్​ లో 223 పాట్ల ను ఈ–ఆక్షన్​ ద్వారా మార్చి మూడో వారంలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

నేడు బహదూర్​ పల్లి ప్రీబిడ్​ మీటింగ్​

మేడ్చల్​ మల్కాజ్​ గిరి జిల్లా పరిధిలోని బహదూర్​ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్​ లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి బుధవారం(23వ తేదీ) నాడు ప్రీబిడ్​ మీటింగ్​ జరుగనున్నది. బహదూర్​ పల్లిలో మేకల వెంకటేశ్​ ఫంక్షన్​ హాల్​ లో బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రీబిడ్​ మీటింగ్​ ప్రారంభం కానున్నది.

25న తొర్రూర్​ సైట్​ లో ప్రీబిడ్​ మీటింగ్​

రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్​ లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్​ఎండిఏ లేఅవుట్​ను అభివృద్ధి చేస్తుంది. అందులోని 223 ప్లాట్లను ఈ ఆక్షన్​ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీబిడ్​ మీటింగ్​ను ఈనెల 25వ తేదీన తోర్రూర్​ సైట్​ లోనే నిర్వహించనున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles