Categories: TOP STORIES

రూ.80 కోట్లతో రెండు భ‌వ‌నాల్ని కొన్న దివీ ల్యాబ్స్ నీలిమా

ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ లేబొరేటరీస్ మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి హైదరాబాద్ లో రూ.80 కోట్లు వెచ్చించి రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ లో 12 వేల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా కలిగిన ప్రాపర్టీని రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. శ్రీనివాస్ ప్రసాద్, సూర్య కమల్ ప్రసాద్, సత్యచంద్ర ప్రసాద్ నుంచి దీనిని కొన్నారు.

12వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండో ప్రాపర్టీని మోటూరి సూర్య కమల్ ప్రసాద్ నుంచి రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో ఖరీదైన ప్రాపర్టీలకు గత రెండేళ్లుగా డిమాండ్ బాగా కొనసాగుతోంది.

This website uses cookies.