Categories: LATEST UPDATES

గండిపేట చెరువు సుందరీకరణ పనులు?

గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి సమీక్షించారు. మంగ‌ళ‌వారం బీఆర్‌కేఆర్‌ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర‌వింద్ కుమార్‌తో కలిసి గండిపేట చెరువు సుందరీకరణ పనులపై నిర్వ‌హించిన స‌మీక్ష‌లో.. మొదటి దశలో వాకింగ్ ట్రాక్‌, సైక్లింగ్ ట్రాక్‌కు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గండిపేట చెరువు చుట్టు సుందరీకరణ పనులను చేపట్టేందుకు తగిన ప్రణాళిక‌ల్ని రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు సుందరీకరణ పనుల్లో భాగంగా పార్కులను కూడా అభివృద్ధి పరచాలని సీఎస్ పేర్కొన్నారు. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, హెచ్ఎండీఎ, ఎండోమెంట్ , రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు.

This website uses cookies.