poulomi avante poulomi avante

ఆఫీస్ లీజింగ్ లో జీసీసీల దూకుడు

  • రెండున్నరేళ్లలో 53 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ లీజింగ్
  • మొదటి రెండు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్

భారత్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) దూకుడు కొనసాగుతోంది. 2022 నుంచి 2024 ప్రథమార్ధం వరకు 53 మిలియన్ చదరపు అడుగులు స్పేస్ ను లీజుకు తీసుకున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబై నగరాల్లో జీసీసీలు ఈ స్పేస్ ను లీజుకు తీసుకున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ, హైరింగ్ సొల్యూషన్స్ గ్రూప్ జోయిన్ కలిసి విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా లీజుకు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లో జీసీసీల వాటా 37 శాతం ఉందని తెలిపింది. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వాటా 22 శాతానికి పెరిగినట్టు వివరించింది. గత రెండున్నరేళ్లలో టెక్నాలజీ కంపెనీలు 15 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. జీసీసీ ఆఫీస్ లీజులో బెంగళూరు టాప్ లో ఉండగా.. హైదరాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 జనవరి-జూన్ కాలంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జీసీసీ ల లీజింగ్ కార్యకలాపాలు వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగాయి.

నగరాలవారీగా చూస్తే.. 2022 నుంచి 2024 జూన్ వరకు దేశంలోని జీసీసీ లీజింగ్ మార్కెట్లో 40 శాతం వాటాతో బెంగళూరు అగ్రభాగాన నిలిచింది. ఈ కాలంలో బెంగళూరులో 21.2 మిలియన్ చదరపు అడుగులు స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. బెంగళూరు తర్వాత 21 శాతం వాటాతో హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ రెండున్నరేళ్ల కాలంలో 11.13 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. అలాగే చెన్నైలో 7.42 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, పుణెలో 6.36 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఢిల్లీలో 4.77 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను జీసీసీలు లీజుకు తీసుకోగా, ముంబైలో ఇది 2.12 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కాగా, జీసీసీలు ప్రస్తుతం డిజిటల్ వైపు పరివర్తనం చెందుతున్నందున ముందుచూపుతో ఆలోచించే ఏ అంతర్జాతీయ సంస్థకైనా ఇవి అవసరమైన భాగంగా మారిపోయాయని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. ‘భారతదేశంలో సమృద్ధిగా ఉన్న టెక్, నాన్ టెక్ టాలెంట్ పూల్ ప్రపంచవ్యాప్త పరిష్కారంగా మారుతోంది. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్స్, ఏరో స్పేస్ రంగాలు భారతీయ జీసీసీ ఉనికిని విస్తరించడం వల్ల భవిష్యత్తు మరింత వైవిధ్యంగా ఉంటుంది. జీసీసీల అభివృద్ధికి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తో ప్రపంచీకరణ తదుపరి తరంగానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles