Categories: LATEST UPDATES

జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ ఆఫర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు సంస్థ ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈనెల 30లోగా చెల్లించేవారికి 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.

అయితే, ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుకే వర్తిస్తుందని, గత సంవత్సరాల బకాయిలకు వర్తించదని స్పష్టంచేశారు. ప్రాపర్టీ యజమానులకు రాయితీకి సంబంధించిన సమాచారాన్ని వెబ్ లింక్ ద్వారా ఇప్పటికే పంపిచినట్టు జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ వెబ్ లింక్ ద్వారా లేదా సమీపంలోని జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని పేర్కొన్నాయి.

This website uses cookies.