Categories: TOP STORIES

హెచ్ఎండీఏ వేలానికి మంచి ఆద‌ర‌ణ‌

రెజ్ న్యూస్‌, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) బుధ‌వారం నిర్వ‌హించిన ఆన్ లైన్ వేలానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ బుధవారం నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 ప్లాట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా అమ్ముడ‌య్యాయి. దీని ద్వారా సుమారు రూ.195.24 కోట్ల ఆదాయం ల‌భించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్లాట్ల‌ను కొన‌డానికి ఆస‌క్తి చూపెట్ట‌డంతో గ‌జం రూ.1.11 ల‌క్ష‌ల దాకా ప‌లికింది. రెండో దశ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామ‌ని హెచ్ఎండీఏ తెలిపింది.

* ప్లాటు గ‌జం రూ.1.10 ల‌క్ష‌ల‌కు ప‌లకింది కాబ‌ట్టి, అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల‌కు అదే రేటు వ‌ర్తించ‌ద‌ని గుర్తుంచుకోండి. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఈ వేలం నిర్వ‌హించారు కాబ‌ట్టి.. సాధార‌ణ ప్లాట్ల‌కు అదే ధ‌ర ప‌ల‌క‌దు. కాబ‌ట్టి, కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు చేసే ప్ర‌చారాన్ని న‌మ్మి అధిక రేటును పెట్టొద్దు.

This website uses cookies.