Categories: TOP STORIES

హైడ్రా స‌రికొత్త నిర్ణ‌యం

ప్ర‌తి చెరువు వ‌ద్ద ఇద్ద‌రు గార్డులు

చెరువుల దురాక్ర‌మ‌ణ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌తి చెరువు వ‌ద్ద ఇద్ద‌రు గార్డుల‌ను నియ‌మించాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే డెబ్బ‌య్ చెరువుల వ‌ద్ద గార్డుల‌తో నిఘా ఏర్పాటు చేసింది. భ‌విష్య‌త్తులో అన్ని చెరువుల వ‌ద్ద గ‌ట్టి నిఘాను ఏర్పాటు చేయ‌డానికి క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టామ‌ని తెలియ‌జేసింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు 185 చెరువులు, హెచ్ఎండీఏ ప‌రిధిలో 600కి పైగా చెరువులున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రైనా చెరువుల‌ను ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేస్తే వెంట‌నే త‌మ‌కు స‌మాచారం అంద‌జేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు.

This website uses cookies.