సోమవారం ఉదయం బస్ స్టాపులు, మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ పాంప్లెట్ ను ఎవరో పంచి పెట్టినట్లు సమాచారం. తెలుగులో టైప్ చేసిన ఈ పాంప్లెట్లో అశోకా బిల్డర్స్ మోసం గురించి ప్రస్తావించారు. ఈ సంస్థతో ఏ భూయజమాని అయిన జాగ్రత్తగా ఒప్పందం కుదుర్చుకోవాలని అప్రమత్తం చేశారు. అశోకా బిల్డర్స్ సంస్థ మోసకారి కంపెనీగా ఇందులో ప్రస్తావించారు. ఈ పాంప్లెట్ను చూశాక.. అశోకా బిల్డర్స్ గురించి.. వాస్తవాల్ని కనుగొనే ప్రయత్నాన్ని రెజ్ న్యూస్ చేసింది.
స్వర్గీయ జైవీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు అశోకా బిల్డర్స్ అనే సంస్థను 1989లో ఆరంభించారు. కాకపోతే, కొన్నేళ్ల క్రితమే వీరు విడిపోయారు. జైవీర్ రెడ్డి మరణించిన తర్వాత అతని కుమారుడు జైదీప్ రెడ్డి అశోకా బిల్డర్స్ బాధ్యతల్ని చేపట్టారు. ఆయన నిర్మాణ రంగంలో ఎంతో చురుకుగా ఉంటూ.. ఇటీవల కూకట్ పల్లిలో ఒక బడా షాపింగ్ మాల్ను ఆరంభించారు. అశోకా బిల్డర్స్ సంస్థలో మరో కీలక వ్యక్తి అయిన.. లక్ష్మారెడ్డి తన కుమారుడైన ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి నార్త్ స్టార్ హోమ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వినూత్నమైన ప్రాజెక్టుల్ని చేపడుతుందనే ఖ్యాతినార్జించింది.
మూడో వ్యక్తి అయిన విజయభాస్కర్ రెడ్డి అశోకా బిల్డర్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించేవారు. ఆయన మాతృక సంస్థ నుంచి బయటికొచ్చారు. కాకపోతే తను నేటికీ అశోకా బిల్డర్స్ పేరును వాడుకుంటున్నారు. అతని కుమారుడే ప్రస్తుతం ఏసీబీఎల్ సంస్థను నిర్వహిస్తున్నాడని సమాచారం. ఇదే సంస్థ బండ్లగూడలో ఒక ప్రాజెక్టును ఆరంభించేందుకు స్థల యజమానితో ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. మరి, భూయజమాని సంస్థ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. సోమవారం ఉదయమే అశోకా బిల్డర్స్కు వ్యతిరేకంగా.. బండ్లగూడ, కిస్మత్పూర్, స్థానిక మున్సిపల్ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఈ కరపత్రం హల్చల్ చేస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఈ పాంప్లెట్లో బాధితుడు అశోకా బిల్డర్స్ గురించి పదకొండు అంశాల్ని ప్రస్తావించారు. అవేమిటంటే..
This website uses cookies.