Categories: LATEST UPDATES

ఐటీ పార్క్ కొన్న జీఐసీ

రూ.1050 కోట్లకు 1.1 మిలియన్ చదరపు అడుగుల టవర్ సొంతం చేసుకున్న సంస్థ

సింగపూర్ కి చెందిన జీఐసీ కంపెనీ గచ్చిబౌలిలోని ఐటీ సెజ్ లో ఫీనిక్స్ గ్రూప్ నుంచి ఐటీ పార్క్ కొనుగోలు చేసింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను రూ.1050 కోట్లకు కొన్నట్టు సమాచారం. ఫీనిక్స్ అక్విలాకు గచ్చిబౌలిలోని ఐటీ సెజ్ లో 1.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు టవర్లు ఉన్నాయి. వీటిలో 7 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ కొనుగోలు ఇప్పటికే పూర్తయి లీజుకు కూడా ఇచ్చేశారు. ఈ రెండు టవర్లు అమెజాన ఆపరేషనల్ క్యాంపస్ కు పక్కనే ఉన్నాయి. 1.1 మిలియన్ చదరపు అడుగుల రెండో టవర్ నిర్మాణంలో ఉన్నప్పుడే 2021లో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇది పూర్తయింది. ఈ మొత్తం ఐటీ పార్కును 2020లోనే అమెరికా ఐటీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీస్ కు లీజుకు ఇచ్చేసింది. దేశంలోని అతిపెద్ద లీజు లావాదేవీల్లో ఇది ఒకటి.

This website uses cookies.