Categories: LATEST UPDATES

కండ్ల‌కోయ‌లో ఐటీ పార్కు

నార్త్ హైద‌రాబాద్ ఐటీ రంగానికి వేదిక‌గా మారింది. ఇక్క‌డ దాదాపు 35 ఇంజినీరింగ్ కాలేజీలు, 50 డిగ్రీ కళాశాలలు, 35 ఎంబీఏ కాలేజీలు వంటివి ఉన్నాయి. వీరందరూ పశ్చిమ హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకోవ‌డానికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఐటీ పార్కును నిర్మించాల‌ని భావించింది. ఈ క్ర‌మంలో గురువారం మంత్రి కేటీఆర్ ఐటీ పార్కు నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. రానున్న రోజుల్లో ఈ విభాగాన్ని విస్త‌రించే అవ‌కాశ‌ముంది. కొంప‌ల్లిలో టీ హబ్ వింగ్ ఒక‌టి ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. మేడిగడ్డ నుంచి మేడ్చల్ దాకా నీళ్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. యువకులు ఉద్యోగాల్ని నెలకొల్పే స్థాయికి ఎదగాలని సూచించారు. అందుకే కొంపల్లిలో టీ హబ్ వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర హైదరాబాద్లో ఇది ఆరంభం మాత్రమేనని, దుండిగల్ వంటి అనేక ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ కార్యాలయం హైదరాబాద్లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది దాదాపు 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైందన్నారు.

This website uses cookies.