Categories: LATEST UPDATES

అప్పారెల్ త‌యారీ యూనిట్‌కు కిటెక్స్ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ లో కిటెక్స్ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ తయారీ కేంద్రాన్ని ఆరంభించింది. ఇక్క‌డ నుంచి ప్ర‌తిరోజు ఏడు లక్షల దుస్తులను కిటెక్స్ సంస్ధ ఉత్పత్తి చేస్తుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తి అవుతుంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కిటెక్స్ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో భారీ తయారి యూనిట్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వరంగల్ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామ‌ని సంస్థ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కిటెక్స్ సంస్థకి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కిటెక్స్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కిటెక్స్ సంస్ధ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.

This website uses cookies.