Categories: LATEST UPDATES

సానీ ఇండియా 3వ శాఖ ఆరంభం

నిర్మాణ రంగ యంత్రసామాగ్రి మరియు హెవీ మెషినరీ తయారీదారులలో అగ్రగామి సానీ ఇండియా, తెలంగాణా కోసం తమ ఆధీకృత డీలర్‌ మధుర ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి రాష్ట్రంలో తమ ఉనికిని చాటి చెబుతోంది. సేల్స్‌, సర్వీస్‌, స్పేర్స్‌ శాఖలను పెద్ద అంబర్‌పేటలో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సానీ ఇండియా రీజనల్‌ మేనేజర్‌ చేతన్‌ కుమార్‌, మధుర ఇంజినీరింగ్‌ డైరెక్టన్‌ శ్రీమతి రంజిత రావు కాట్రగడ్డ నిర్వహించారు.

ఈ సందర్భంగా శానీ హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ , చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ధీరజ్‌ పాండా మాట్లాడుతూ ‘‘ మా డీలర్‌షిప్‌ మధుర ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కోసం నూతన కార్యాలయం ప్రారంభించడం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ నూతన 3ఎస్‌ సదుపాయం మా వినియోగదారులకు తగిన సేవలను అందించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

మధుర ఇంజినీరింగ్ ఎండీ మధుసూదన్‌ కాట్రగడ్డ మాట్లాడుతూ ‘‘ నిర్మాణ యంత్ర సామాగ్రి పరిశ్రమకు అవసరమైన వ్యవస్థ తెలంగాణాకు ఉంది. దీనికి తోడు రాష్ట్ర స్ధాయిలో ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార వాతావరణంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి. వీటితో పాటుగా సానీ ఇండియా నుంచి మాకు అత్యద్భుతమైన సహకారం లభిస్తుంది. ఈ నూతన కార్యాలయం మా విస్తరణకు మరింతగా తోడ్పడనుంది’’ అని అన్నారు.

This website uses cookies.