Categories: LATEST UPDATES

హైదరాబాద్ లో మైక్రాన్ టెక్నాలజీ ఆఫీసు

10.43 లక్షల చ.అ. స్థలం
లీజుకు తీసుకున్న సంస్థ

మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ సంస్థ హైదరాబాద్ 10.43 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ అక్విలా భవనంలో గ్రౌండ్ ప్లస్ 16 అంతస్తులను నెలవారీ అద్దె రూ. 6.8 కోట్ల చొప్పున పదేళ్లపాటు లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.65 అద్దె చొప్పున ఈ నెల 2న ఒప్పందం చేసుకుంది. ఈ లావాదేవీ కోసం కంపెనీ రూ. 40.69 కోట్లు డిపాజిట్ చేసింది. ఒప్పందంలో భాగంగా 1430 కార్ పార్కింగ్ స్థలాలకు కంపెనీ యాక్సెస్ కలిగి ఉంది.

This website uses cookies.