Categories: AREA PROFILE

నవశకానికి ‘ఆరంభ్’

  • షాద్ నగర్లో స్కంధాన్షి నుంచి కొత్త ప్రాజెక్టు

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్కంధాన్షి.. షాద్ నగర్ లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ శివార్లలో ఓపెన్ ప్లాట్ల కోసం చూస్తున్నవారి కోసం షాద్ నగర్ లో ‘ఆరంభ్’ పేరుతో కొత్త వెంచర్ లాంచ్ చేసింది. ఇందులో ఓపెన్ ప్లాట్లే కాకుండా 2బీహెచ్ కే ఇళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యం, ఆనందం, ఆధునిక జీవన శైలి మేళవించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది.

మీ జీవితంలో నవశకానికి ఆది ఆరంభం వంటిదని, కుటుంబం మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడానికి ఇది ఎంతో అనువైన ప్రాంతం అని పేర్కొంటోంది. ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, బాంకెట్ హాల్, పిల్లల ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ఇళ్లు కొని నివసించాలనుకునేవారికే కాకుండా పెట్టుబడి పెట్టేవారికి కూడా ఇదో మంచి అవకాశం అని సంస్థ స్పష్టంచేస్తోంది.

స్కేటింగ్ గ్రౌండ్, 60, 33 అడుగుల బీటీ రోడ్లు, యాంఫి థియేటర్, అవెన్యూ ప్లాంటేషన్, 200 సీట్ల సామర్థ్యం కలిగిన బాంకెట్ హాల్, పిల్లల ఆటస్థలం, చిల్డ్రన్ ట్రెక్కర్, కాంపౌండ్ వాల్, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఎంట్రన్స్ ఆర్చ్, మినరల్ వాటర్ ప్లాంట్, ప్రతి ప్లాట్ కు నేమ్ బోర్డు, పోలీస్ ఔట్ పోస్టు, వాటర్ ట్యాంకు, స్విమ్మింగ్ పూల్, వర్షపు నీటి హార్వెస్టింగ్ పిట్ వంటి ఎన్నో ఉన్నాయి.

This website uses cookies.