Categories: LATEST UPDATES

రాణీ, దిశా.. సొంతిల్లు

మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసిన స్టాంప్ డ్యూటీ తగ్గింపును బాలీవుడ్ తారలకు భలే కలిసొస్తుంది. 2021 మార్చి 31తో గడువు ముగుస్తుండటంతో బాలీవుడ్ అందాల తారలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. రాణీ ముఖర్జీ, దిశా పతానీలు ప్రీమియం ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలో రుస్తోంజీ గ్రూప్ డెవలప్ చేసిన రుస్తోంజీ పారామౌంట్లో 1485 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ.7.12 కోట్లు పెట్టి కొన్నారు.

పతాని 1119 చదరపు అడుగుల ఫ్లాట్ ని రూ.5.95 కోట్లకు కొన్నారు. రాణీ కి రెండు కారు పార్కింగులు లభించాయి. జులై 15న జరిగిన రిజిస్ట్రేషన్ సందర్భంగా రూ21.37 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. జూన్ 16న జరిగిన రిజిస్ట్రేషన్ సందర్భంగా దిశా పతానీ రూ.17.85 లక్షల స్టాంప్ డ్యూటీ కట్టారు.

This website uses cookies.