Categories: LATEST UPDATES

పెప్పర్ ఫ్రై కొత్త స్టూడియో

పెప్పర్ ఫ్రై సంస్థ నగరంలో మూడో స్టూడియోను ఆరంభించింది. మియాపూర్లోని హెచ్ఐజీ మయూరీనగర్ మెయిన్ రోడ్డులో 525 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది తమ 75వ స్టూడియో అని సంస్థ చెబుతోంది. ఈ స్టూడియోలో పెప్పర్ ఫ్రై వెబ్ సైటుకు సంబంధించిన దాదాపు లక్షకు పైగా వస్తువుల సమాచారం ఉంటుంది. కొన్ని వస్తువులను ప్రదర్శనకు ఉంచింది. దీంతో, తమ వస్తువుల నాణ్యత కొనుగోలుదారులకు తెలుస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ సంస్థకు చెందిన డిజైనర్ల సేవల్ని కూడా ప్రజలు అందుకోవచ్చు.

This website uses cookies.