Categories: LEGAL

జీ స్క్వేర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు..

వ‌న‌స్థ‌లిపురం పోలీసులు అరెస్టు చేయ‌కుండా నిలువ‌రించాల‌ని కోరుతూ.. హైద‌రాబాద్ జీ స్క్వేర్ రియ‌ల్ట‌ర్స్ అధికారిక ప్ర‌తినిధి త్యాగ‌రాజ‌న్ ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌లో ప్లాట్ల కొనుగోలుదారులను మోసం చేశారంటూ.. కొణ‌తం న‌వ‌కిశోర్‌రెడ్డి అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థ‌ల నుంచి స‌రైన అనుమ‌తులు లేకుండానే ప్లాట్ల‌ను విక్ర‌యించి మోసం చేశార‌ని ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వ‌న‌స్థ‌లిపురం పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న అరెస్టును నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ ఆయ‌న హై కోర్టును ఆశ్ర‌యించ‌గా.. పోలీసులు త‌మ అధికారాల‌ను వినియోగించుకునే విధానాన్ని అనుస‌రించాల‌ని కోర్టు ఆదేశించింది.

This website uses cookies.