Categories: LEGAL

జీఎస్ఆర్ ఇన్‌ఫ్రా ఎండీ.. కొల్లూరు పీఎస్‌లో హాజ‌రు కావాలి..

కొల్లూరు పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌కుండా నిలువ‌రించాల‌ని కోరుతూ.. జీఎస్ఆర్ ఇన్‌ఫ్రా ఎండీ గుంటుప‌ల్లి శ్రీనివాస్ రావు ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. రామ‌స్వామి ల‌క్ష్మీకాంత్ రెడ్డి అనే వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. కొల్లూరు పోలీసులు శ్రీనివాస్ రావుపై కేసు న‌మోదు చేశారు. సంస్థ అడిగిన మొత్తం సొమ్ము చెల్లించినా జీఎస్ఆర్ ఎండీ.. త‌న‌కు ప్రాప‌ర్టీని అంద‌చేయ‌లేద‌ని ఫిర్యాదు చేశారు. మోకిలాలో ప్రీలాంచ్‌లో విల్లా ప్లాట్లు, ఫ్లాట్ల‌ను ప్రీలాంచ్‌లో విక్ర‌యించి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేశార‌ని జీఎస్ఆర్ ఇన్‌ఫ్రాపై ఆరోప‌ణ‌లున్నాయి.

ఇత‌నిపై గ‌తంలో రామ‌చంద్రాపురం పీఎస్‌లో కూడా కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో త‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌కుండా ఉత్త‌ర్వ్యుల్ని జారీ చేయాల‌ని కోర్టును కోరారు. కాక‌పోతే, అత‌ను చేసిన అభ్య‌ర్థ‌న‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది. మార్చి 12న ఉద‌యం 11 నుంచి సాయంత్రం 5 లోపు కొల్లూరు స్టేష‌న్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ ముందు హాజ‌రు కావాల‌ని కోర్టు తీర్పునిచ్చింది.

This website uses cookies.