Categories: LATEST UPDATES

అత్యుత్తమ కాంక్రీట్ ఇంజనీర్ గా ప్రదీప్ కుమార్

ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రమణచర్ల ప్రదీప్ కుమార్ ను 2021 సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో అత్యుత్తమ కాంక్రీట్ ఇంజనీర్ గా ఎంపిక చేసినట్టు ఇండియన్ కాంక్రీట్ ఇన్ స్టిట్యూట్ (ఐసీఐ) ప్రకటించింది. ఈ మేరకు ఐసీఐ చైర్మన్ పి. శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఐసీఐతో కలిసి అల్ట్రాటెక్ సిమెంట్ ఏర్పాటు చేసిన ఈ అవార్డును పార్క్ హయత్ లో జరిగన ఓ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్ కు ప్రదానం చేసినట్టు ఐఐటీ హైదరాబాద్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీఐ అనేది కాంక్రీట్, కాంక్రీట్ నిర్మాణ రంగంపై పనిచేస్తున్న ఓ సంస్థ. 1982 సెప్టెంబర్ 7న చెన్నైలో ప్రారంభమైన ఈ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 కేంద్రాలు, 152 స్టూడెంట్ చాప్టర్లు, దాదాపు 12 వేల మంది సభ్యులు ఉన్నారు.

This website uses cookies.