Categories: LATEST UPDATES

రూ.5వేల కోట్ల సమీకరణకు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రయత్నాలు

ప్రముఖ రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.5వేల కోట్ల సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. తన సంస్థాగత పెట్టుబడుల్లో షేర్లు అమ్మకం, హోటల్ వ్యాపారం నుంచి ఈ మొత్తాన్ని సమీకరించాలని యోచిస్తోంది. ఈ మేరకు తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరాలు వెల్లడించింది. ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5వేల కోట్లకు మించకుండా మొత్తాన్ని సమీకరించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది.

అలాగే తన అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ లిమిటెడ్ ఆస్తులను మానిటైజ్ చేయడానికి కూడా బోర్డు ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయాలన్నీ షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. ఆతిథ్యరంగంలోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ పర్యవేక్షించడానికి బోర్డు ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

This website uses cookies.