Categories: LATEST UPDATES

అమెరికా ప్రాప‌ర్టీ షోలో రాంకీ ఎస్టేట్స్‌

కరోనా అనంతరం దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అమెరికాలో ఇండియా ప్రాపర్టీ ఎక్స్ పో జరగనుంది. ఈనెల 14, 15వ తేదీల్లో డల్లాస్ లోని అరవింద్ కన్వెన్షన్లో.. 21, 22వ తేదీల్లో న్యూజెర్సీలోని క్రౌన్ ప్లాజా హోటల్ లో.. 28, 29వ తేదీల్లో కాలిఫోర్నియాలోని శాంటాక్లాజా కన్వెన్షన్ సెంటర్లో జ‌రుగుతున్న ప్రాప‌ర్టీ షో లో తాము పాల్గొంటున్నామ‌ని.. రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిషోర్ తెలిపారు.

గత ఏడాదిన్నర కాలంలో తాము.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించామ‌ని తెలిపారు. అపార్టుమెంట్లు, విల్లాలు.. ఎవరికి కావాల్సింది వారు ఎంపిక చేసుకునే అవకాశాన్ని తాము ప్ర‌వాసుల‌కు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. అమెరికాలో ప్ర‌త్యేకంగా జ‌రుగుతున్న ఈ ఎక్స్‌పోకు విచ్చేసి.. త‌మ ప్రాజెక్టుల వివ‌రాలు తెలుసుకోవాల‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు.

This website uses cookies.