Categories: Celebrity Homes

రణ్ వీర్ ఫ్లాట్ ఖరీదు రూ.119 కోట్లు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ అదిరిపోయే సీ వ్యూ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ముంబై బాంద్రాలోని సాగర్ రేషమ్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ లో ఓ క్వాడ్రప్లెక్స్ అపార్ట్ మెంట్ ను రూ.119 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోవడం విశేషం. దేశంలో జరిగిన అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఇది ఒకటిగా రికార్డులకెక్కింది. అపార్ట్ మెంట్ లోని 16, 17, 18, 19వ అంతస్తుల్లో మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతోపాటు 1,300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రస్ తో ఈ ఫ్లాట్ ఉంది.

చదరపు అడుగుకు రూ.లక్ష పైనే ధర పలకడం గమనార్హం. ఓహ్ ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ ఎల్ఎల్ పీ అనే సంస్థ పేరు మీద రణ్ వీర్ ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు. రణ్ వీర్, ఆయన తండ్రి జగ్ జీత్ సుందర్ సింగ్ దీనికి డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక ఈ లావాదేవీకి సంబంధించి స్టాంపు డ్యూటీ కింద రూ.7.13 కోట్లు చెల్లించారు. మొత్తం 19 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఈ డీల్ లో ఉన్నాయి.

This website uses cookies.