Categories: LATEST UPDATES

ఆర్బీఐ సరైన నిర్ణయమేనా?

ఆర్‌బిఐ ఆశించిన విధంగానే ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 4% వద్ద స్థిరంగా ఉంచిందని నిపుణులు అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ వల్ల ఎదురవుతున్న ఆర్థిక పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే ఇది సరైన నిర్ణయమని అనిపిస్తోంది. ఏదీఏమైనా.. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిని పునరుద్ధరించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ నేషనల్ హౌసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ కు ద్రవ్య మద్దతును ప్రకటించాలని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే, ఇది భారతదేశంలోనే అధిక శాతం మందికి ఉపాధిని అందించేది నిర్మాణ రంగమే కాబట్టి, ఆ మత్రం మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందే. ’రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ను ప్రారంభించాలన్న సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వల్ల డెవలపర్ కమ్యూనిటీ కొంత మద్దతు లభిస్తుందని, దీని కింద ఆర్‌బిఐ రుణగ్రహీతల కవరేజీని రూ .25 కోట్ల నుండి రూ .50 కోట్లకు పెంచుతుంది. రెండవ వేవ్ ప్రభావంతో తిరిగే దేశంలోని చిన్న వ్యాపారాలకు బాగా ఉపయోగపడే ఈ చర్యలో, ఆర్‌బిఐ ఎంఎస్‌ఎంఇలకు మద్దతుగా సిడ్బికి రూ .16,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాన్ని విస్తరించిందని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ అగర్వాలా తెలిపారు.

ఉక్కు, సిమెంట్ మరియు ముడి చమురు ధరలు పెరుగుతున్నందున, ద్రవ్యోల్బణం యొక్క ఒత్తిడి పెరుగుతోంది. రియల్ ఎస్టేట్, నిర్మాణాత్మక పరివర్తనాలు మరియు ఆరోగ్యకరమైన ఆర్థిక దృక్పథం వల్ల మార్కెట్‌ను సానుకూల దిశలో నడిపిస్తుంది. ఏదీఏమైనా, పెరుగుతున్న సిమెంట్ మరియు ఉక్కు వంటి కీలకమైన నిర్మాణ సామగ్రి ధరల్ని ప్రభుత్వ సంస్థలు పరిశీలించాలని.. ఇటీవలి కాలంలో ధరలు పెరగడం వల్ల నిర్మాణ కార్యకలాపాల్ని మందకోడిగా సాగేలా చేయడమే కాకుండా బలహీనపరిచిందని 360 రియల్టర్స్ ఎండీ అంకిత్ కన్సల్ అభిప్రాయపడ్డారు.

This website uses cookies.