Categories: Rera

ఐదుగురు బిల్డర్ల నుంచి రూ.9 కోట్ల రికవరీ

కొనుగోలుదారులకు ఇవ్వాల్సిన పరిహారం లేదా రిఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఐదుగురు బిల్డర్ల నుంచి రెరా అధికారులు రూ.9 కోట్లు వసూలు చేశారు. ఇందుకోసం తొమ్మిది వారెంట్లు జారీ చేశారు. మొత్తం రూ.8.72 కోట్ల రికవరీకి సంబంధించి ముంబై సిటీ, ముంబై సబర్బన్, పుణె జిల్లాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన ఐదుగురు బిల్డర్లకు ఈ మేరకు వారెంట్లు జారీ చేసినట్టు మహా రెరా అధికారులు వెల్లడించారు. దీంతో కొందరు బిల్డర్లు సదరు మొత్తాన్ని జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయగా.. మరికొందరు బిల్డర్లు నేరుగా కొనుగోలుదారులకు ఆ మొత్తం చెల్లించి ఆ ఫిర్యాదులను పరిష్కరించుకున్నట్టు వివరించారు. కాగా, మహా రెరా ఇప్పటివరకు రూ.623.30 కోట్ల రికవరీకి సంబంధించి 1015 వారెంట్లు జారీ చేసింది.

This website uses cookies.