Categories: LEGAL

షైన్ సిటీ యజమానిపై రెడ్ కార్నర్ నోటీసు

ఫ్లాట్లు, ప్లాట్ల పేరుతో పలువురిని రూ.350 కోట్ల మేర మోసం చేసిన బిల్డర్ రషీద్ నసీమ్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేంద్ర హోంశాఖను కోరడంతో ఈ మేరకు నోటీసు జారీ అయింది. షైన్ సిటీ సంస్థ యజమాని అయిన నషీద్ చాలామందికి ఫ్లాట్లు, ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.350 కోట్ల వరకు వసూలు చేశాడు. అనంతరం పత్తా లేకుండా దుబాయ్ పారిపోయాడు.

ఈ నేపథ్యంలో అతడిపైనా, కంపెనీ ప్రమోటర్లపైనా యూపీ వ్యాప్తంగా 290 కేసులు నమోదయ్యాయి. అతడి గురించి సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డు కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నషీద్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడు అక్కడి నుంచి తప్పించుకుపోకుండా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.

This website uses cookies.