Categories: LATEST UPDATES

జూన్ లోనే భారతీ రియాల్టీ సిబ్బందికి టీకా

జూన్ 15 నాటికి టీకా భారతీ రియాల్టీ తమ ఉద్యోగులకు మొదటి డోస్ టీకాను వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించింది. ఈ సంస్థ ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులకు మొదటి డోసును వేయించింది.

భారతి రియాల్టీ గ్రూప్ అపోలో హాస్పిటల్స్, ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరియు ఇతర వైద్య సేవా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కోవిడ్ షీల్డ్ మరియు కోవాక్సిన్లను ఉద్యోగులకు అందజేస్తోంది. “ఈ క్లిష్ట సమయాల్లో మా వ్యాపారాన్ని కొనసాగించడంలో మాకు సహకరించిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు మూడవ పార్టీ అమ్మకందారుల సిబ్బందికి సురక్షితంగా టీకాలు వేయడానికి అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటున్నామ”ని సంస్థ సీఈవో ఎస్.కె. సయాల్ తెలిపారు. టీకాలు వేసే కార్యక్రమం మే 2021 చివరి వారంలో ప్రారంభమైంది. ఈ సంస్థ గతంలో తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచితంగా 15 పడకల ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

This website uses cookies.