Categories: LATEST UPDATES

వీఎంఆర్డీఏ 37 ప్లాట్ల వేలం.. 24 చివ‌రి తేది

భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సముపార్జిస్తున్న విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ).. తాజాగో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని వివిధ లేఔట్లలో ఉన్న 37 ప్లాట్ల అమ్మకానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి ధరలను ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి రూ.14వేల నుంచి రూ.55వేల మధ్యలో నిర్ధారించింది. కొన్న ప్లాట్లు గరిష్టంగా 800 గజాల వరకు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 24 చివరి తేదీ అని వీఎంఆర్డీఏ ప్రకటించింది. అనంతరం ఫిబ్రవరి 27న ఈ వేలం నిర్వహిస్తామని.. దరఖాస్తుదారులు ఆ రోజు ఏపీ వేలం వెబ్ సైట్ (http://konugolu.ap.gov.in) ద్వారా వేలంలో పాల్గొనాలని సూచించింది.

This website uses cookies.