Categories: LATEST UPDATES

“సీఎన్ఎన్ వెంచ‌ర్స్‌”పై అర‌వింద్ కుమార్ సీరియ‌స్‌

కోకాపేట్ వేలం పాట‌ల నేప‌థ్యంలో.. ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన సీఎన్ఎన్ వెంచ‌ర్స్ మీద పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ శుక్ర‌వారం క‌న్నెర్ర చేశారు. హెచ్ఎండీఏ పేరును ఉప‌యోగించుకుని విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను చూస్తే.. కోకాపేట్‌లో ఈ సంస్థ స్థ‌లం కొనుక్కున్న‌ట్లుగా ప్ర‌జలు అభిప్రాయ‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇంకా, వేలం పాట నిర్వ‌హించ‌క‌ముందే ఇలాంటి మోస‌పూరిత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంపై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ఇలాంటి సంస్థ‌లు విడుద‌ల చేసే ఇలాంటి ప్ర‌క‌ట‌నల్ని గుప్పించే సంస్థ‌ల వ‌ల‌లో ఎవ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కోరారు. వెంట‌నే సీఎన్ఎన్ వెంచ‌ర్స్ పై త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుంటున్నామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

This website uses cookies.