Categories: LATEST UPDATES

సీఎన్ఎన్ వెంచర్స్ పై హెచ్ఎండీఏ కేసు

హైదరాబాద్​ : హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) కోకాపేట్​ లే అవుట్ లో భూముల Kokatpet Neopolis​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ‘సిఎన్ఎన్​ వెంచర్స్​’ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​(సిసిఎస్​) పోలీసులు ఎఫ్ఐఆర్​(104/2021) నమోదు చేశారు.

  • పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేసిన హెచ్ఎండిఏ
  • కోకాపేట్​ భూముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రియల్​ ఎస్టేట్​ సంస్థపై ఎఫ్ఐఆర్​
  • ప్రకటనలు నమ్మి మోసపోవద్దని హెచ్ఎండిఏ హితవు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టిసి లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సిఎన్ఎన్​ వెంచర్స్​ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్​ఎండిఏ తీవ్రంగా పరిగణించింది.

కోకాపేట్ | Kokapet Neopolice

కోకాపేట్​ భూములను మార్కెట్​ విలువలో యాబై శాతం(50%) పెట్టుబడులతో 1,500 చదరపు అడుగుల వరకు 3బిహెచ్​కె ఫ్లాట్​ లను సొంతం చేసుకోవచ్చని సిఎన్ఎన్​ వెంచర్స్​ ప్రకటనలద్వారా అమాయక ప్రజలను వంచనకు గురిచేస్తున్నది.

ఒకవైపు కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ కొనసాగుతుండగా, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బిహెచ్​కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించి ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సిఎన్ఎన్​ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ సెక్రెటరీ, ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్ఆర్)​ ప్రాజెక్టు డైరెక్టర్​ సంతోష్​ ఐఏఎస్​ శుక్రవారం నగర పోలీస్​ కమిషనర్​ కు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎండిఏ భూముల వేలం పూర్తికాకముందే నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్​ వెంచర్స్​ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండిఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండిఏ సూచించింది.

This website uses cookies.