Categories: TOP STORIES

జిల్లాలకు చేరిన ప్లాట్ల వేలం

  • ఎనిమిది జిల్లాల్లో 1,092 ప్లాట్ల వేలం ప్రక్రియ
  • కలెక్టర్ల ఆధ్వర్యంలో నేడు ప్రిబిడ్​ సమావేశం

తెలంగాణ ప్రభుత్వం వేలం ప్రక్రియ జిల్లాలకు చేరింది. ఎనిమిది జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్​ ప్లాట్లను ఖరీదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎనిమిది జిల్లాల పరిధిలో వివిధ సైజుల్లో ఉన్న దాదాపు 1,092 ఓపెన్​ ప్లాట్లను పారదర్శకంగా భౌతిక వేలం ప్రక్రియలో వేలం వేస్తారు. మహబూబ్​నగర్​, నల్లగొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, కె.బి.ఆసిఫాబాద్​, వికారాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ప్రిబిడ్​ సమావేశాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న ఓపెన్​ ప్లాట్ల సంఖ్యను బట్టి మార్చి నెలలో 14 నుంచి 17వ తేదీ వరకు భౌతిక పద్దతిలో వేలం నిర్వహిస్తారు.

This website uses cookies.