Categories: LATEST UPDATES

బెంగళూరులో జోరుగా భూముల కొనుగోళ్లు

  • ఏడెకరాలు కొన్న గోద్రేజ్ ప్రాపర్టీస్
  • 7.26 ఎకరాలు కొనుగోలు చేసిన పూర్వాంకర

బెంగళూరులో భూములు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద పరిమాణంలో భూములు కొంటున్నారు. ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టు కోసం ఉత్తర బెంగళూరులోని థానిసాండ్రలో ఏడెకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు .1200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అలాగే హెబ్బగోడిలో పూర్వాంకర లిమిటెడ్ 7.26 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్టులో దాదాపు 7.5 లక్షల చదరపు అడుగుల ప్రాంతం అమ్మకానికి ఉంటుందని పేర్కొంది.

ఈ ప్రాజెక్టు స్థూల విలువ రూ.900 కోట్లకు పైమాటేనని వెల్లడించింది. భూముల లభ్యతతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి బెంగళూరును పరిణితి కలిగిన రియల్ ఎస్టేట్ మార్కెట్ గా చేశాయని.. ఫలితంగా అక్కడ రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కు డిమాండ్ పెరిగిందని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ గౌరవ్ పాండే తెలిపారు. బెంగళూరులో హౌసింగ్ డిమాండ్ పెరగడంతో రియల్టర్లు పెద్ద పరిమాణంలో భూముల కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు.

This website uses cookies.