poulomi avante poulomi avante

రూ.33 కోట్లతో ఇల్లు కొన్న మేక్ మై ట్రిప్ సీఈఓ

జెన్ ప్యాక్ట్ సీహెచ్ఆర్ వో కూడా..

మేక్ మై ట్రిప్ సీఈఓ రాజేశ్ మాగో, జెన్ ప్యాక్ట్ సీహెచ్ఆర్వో పీయుష్ మెహతా ఇళ్లు కొనుక్కున్నారు. గుర్గావ్ గోల్ఫ్ కోర్సు రోడ్డులోని డీఎల్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న మంగోలియాస్ ప్రాజెక్టులో ఇరువురూ చెరో ప్లాట్ తీసుకున్నారు. ఇందుకోసం రాజేశ్ రూ.33 కోట్టు చెల్లించగా.. పీయుష్ రూ.32.6 కోట్లు చెల్లించారు. రెండు అపార్ట్ మెంట్లూ 6500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. గోల్ఫ్ కోర్సు రోడ్డులో ఉన్న మూడు ప్రాజెక్టులు (అరేలియస్, మంగోలియాస్, కెమెలియాస్) ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2022 అక్టోబర్ లో ఇందులోని అపార్ట్ మెంట్ రూ.19 కోట్లకు విక్రయం కాగా, ఇప్పుడు రూ.33 కోట్లు పలుకుతోంది. పలు కంపెనీల సీఈఓలు, స్టార్టప్ ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఈ ప్రాజెక్టుల్లో నివసించడానికి మొగ్గు చూపిస్తుండటంతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles