poulomi avante poulomi avante

ముంబైలో ఫ్లాట్ కొన్న క్రికెటర్ యశస్వి జైశ్వాల్

భారత క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ముంబై బాంద్రా ఈస్ట్ లోని టెన్ బీకేసీ ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ కొన్నారు. 1110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ను రూ.5.38 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ గతనెల 7న జరిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టును నిర్మిస్తున్న అదానీ రియల్టీ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అసలు ప్రమోటర్ రేడియస్ ఎస్టేట్స్ దివాలా తీయడంతో దీనిని అదానీ రియల్టీ కొనుగోలు చేసింది.

ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాదే ఫ్లాట్ల అప్పగింత ఉండొచ్చని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. కాగా, జైశ్వాల్ కొనుగోలు ఒప్పందం ప్రకారం చదరపు అడుగుకు రూ.48వేల పైనే ధర పలికింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles