Categories: LATEST UPDATES

అనుమతుల్లో జాప్యం.. 13 మంది అధికారులకు జరిమానా

భవన నిర్మాణాల కోసం టీఎస్ బీపాస్ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయని అధికారులపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. సకాలంలో అనుమతులు జారీ చేయని 13 మంది అధికారులకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల జరిమానా విధించింది. టీఎస్ బీపాస్ చట్టం స్ఫూర్తిని కొనసాగించేందుకు పెండింగ్ దరఖాస్తులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం.. ఈ మేరకు వారికి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఆ అధికారులకు జరిమానా విధించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

This website uses cookies.