Categories: TOP STORIES

ఆనంద నిల‌యం లాంచ్‌లో డీజే టిల్లు హ‌ల్‌చ‌ల్

వాస‌వి గ్రూప్ ఆనంద నిల‌యం ప్రాజెక్టును ఆదివారం నాడు ఎల్‌బీన‌గ‌ర్‌లో అట్ట‌హాసంగా ఆరంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డీజీ టిల్లు ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి కార్య‌క్ర‌మాన్ని ఉర్రూత‌లూగించాడు. సినీతార‌లు శ్రీల‌ల‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్‌లు ఆరంభోత్స‌వానికే కొత్త అందాన్ని తెచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ మ‌రియు మ్యూజిక్ కార్య‌క్ర‌మం హైలైట్గా నిలిచాయి. ఈమ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో.. ఏ ఇత‌ర ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం ఇంత ఘ‌నంగా జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి.

మొత్తానికి, వాస‌వి ఆనందం నిల‌యం ప్రారంభోత్స‌వం రియ‌ల్ రంగంలోనే స‌రికొత్త ఉత్సాహం నింపింద‌ని చెప్పొచ్చు. ఈ సంద‌ర్భంగా సంస్థ సీఎండీ ఎర్రం విజ‌య్ కుమార్ రెజ్ న్యూస్‌తో మాట్లాడుతూ.. త‌మ బృంద‌మంతా రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. క‌స్ట‌మ‌ర్లు త‌మ‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటామ‌ని తెలిపారు. వాస‌వి ఆనందం ప్రాజెక్టును సుమారు మూడున్న‌రేళ్ల‌లోపు పూర్తి చేసి.. కొనుగోలుదారుల‌కు అంద‌జేస్తామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా సంస్థ డైరెక్ట‌ర్లు అభిషేక్ చందా, సౌమ్య‌లు మాట్లాడుతూ.. న‌గ‌ర నిర్మాణ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. ఈస్ట్ హైద‌రాబాద్‌కే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా వాస‌వి ఆనంద నిల‌యం నిలుస్తుంద‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతి పెద్ద అందమైన లగ్జరీ క‌మ్యూనిటీగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌రానికి చెందిన ప‌లువురు బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు పాల్గొని.. వాస‌వి గ్రూప్ ఎండీకి శుభాకాంక్ష‌లు తెలిపారు.

This website uses cookies.