Categories: LATEST UPDATES

గుప్తా బిల్డర్స్ పై మరో నాలుగు ఎఫ్ ఐఆర్ లు

ప్రజలను మోసం చేసిన వ్యవహారంలో గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ (జీబీపీ)పై పోలీసులు మరో నాలుగు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు జీబీపీ డైరెక్టర్లపై 13 కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మోహాలి జిరాక్ పూర్ కు చెందిన స‌తీష్‌ గుప్తా, ప‌ర్దీప్ గుప్తాతో పాటు జీబీపీ ఇతర డైరెక్టర్లు, జీ అండ్ జీ మేనేజింగ్ పార్టనర్ నీరజ్ గుప్తా కలిసి దాదాపు 2500 మందిని రూ.1500 కోట్ల మేర మోసం చేశారు.

వివిధ ప్రాజెక్టుల్లో ప్లాట్లు అమ్ముతామని చెప్పి కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ము కట్టించుకున్నారు. అనంతరం బాధితులు వీరిపై ఫిర్యాదు చేయడంతో జీబీపీ డైరెక్టర్లపై మొహలి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరికొన్ని ఫిర్యాదులు రావడంతో మరో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

This website uses cookies.