Categories: LATEST UPDATES

గోద్రేజ్ ”స్పాట్‌లైట్‌”

అత్యంత సురక్షితమైన హోమ్ కెమెరా శ్రేణి స్పాట్‌లైట్‌ని గోద్రేజ్ సంస్థ ప్రారంభించింది. ఈ వినూత్న ఉత్పత్తి నివాసితులకు డేటా భద్రతను అందిస్తుంది. కస్టమర్ వ్యక్తిగత డేటాకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ కెమెరా వైఫైతోనే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా పని చేస్తుంది. దీని ద్వారా స్ట్రీమింగ్ సులువు అవుతుంది. ఈ కెమెరాను స్థిరంగా ఎక్కడైనా బిగించుకోవచ్చు. లేదా అవసరమైన ఫ్రేమును ఎక్కడ కావాలంటే అక్కడ బిగించుకోవచ్చు. ఏడాది వారెంటీతో వచ్చే ఈ కెమెరా వీడియోలను క్లౌడ్ లో కూడా భద్రపర్చుకోవచ్చు.

దీన్ని ధర కేవలం రూ.4,999. గోద్రెజ్ షాపులతో బాటు అమెజాన్, ఫ్లిప్ కార్టుల్లోనూ లభిస్తుంది. ఈ సందర్భంగా సంస్థ ఉపాధ్యక్షుడు మెహెర్నోష్ పితావాల్లా మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల్లో భద్రతను పెంపొందించేందుకు స్పాట్ లైట్ రేంజ్ హోమ్ కెమెరాల్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంటర్ ప్రైజెస్ హెడ్ వైశాలీ కస్తూరే మాట్లాడుతూ.. సుమారు రూ.300 కోట్ల విలువ గల హోమ్ కెమెరాల మార్కెట్ ను 2022లోపు పదిహేను శాతాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.

This website uses cookies.