Categories: LATEST UPDATES

ఇన్వెస్టో ఎక్స్ పర్ట్ ఆదాయం 56 శాతం పెరుగుదల

ప్రముఖ రియల్ ఎస్టట్ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టో ఎక్స్ పర్ట్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 56 శాతం మేర పెరిగి రూ.56 కోట్లకు చేరింది. హౌసింగ్ కు గట్టి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన ఇళ్ల అమ్మకాల్లో పాలుపంచుకుంది. 2022-23లో ఈ సంస్థ ఆదాయం రూ.36 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.56 కోట్లకు పెరిగింది. నోయిడాకు చెందిన ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,050 కోట్లకు పైగా విలువైన ఇళ్లను అమ్మింది.

వార్షిక ప్రాతిపదికన ఇది 95 శాతం ఎక్కువ. అమ్మకాల్లో చక్కని పనితీరు కనబరిచినందుకు తమ ఆదాయంలో వృద్ధి నమోదైందని ఇన్వెస్టో ఎక్స్ పర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగంలో తమ నిబద్ధతకు, సృజనాత్మతకు ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ విశాల్ రహేజా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధమైన పని తరుతో ముందుకెళతామని పేర్కొన్నారు. ప్రస్తుతం లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించారు.

This website uses cookies.