Categories: PROJECT ANALYSIS

ప్రణీత్ గ్రూప్ నుంచి ఇక్సోరా ప్రాజెక్టు

జేఎన్ టీయూ ప్రాంతంలో హైరైజ్ టవర్లు

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రణీత్ గ్రూప్ జేఎన్ టీయూ ప్రాంతంలో ఇక్సోరా పేరుతో లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్లు దినేష్ రెడ్డి సప్పిడి, ఆదిత్య కామరాజు, నర్సిరెడ్డి సప్పిడి, సందీప్ రావు మాధవరం, కేవీఎస్ నర్సింగరావు కలిసి ప్రాజెక్టును ఆవిష్కరించారు. మొత్తం 8.31 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ హైరైజ్ టవర్లలో మొత్తం 1504 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. 1305 చదరపు అడుగుల నుంచి 3130 చదరపు అడుగుల మధ్యలో వివిధ పరిమాణాల్లో 2, 2.5, 3, 3.5 బీహెచ్ కేలు లభ్యం కానున్నాయి. పిల్లల ఆటస్థలం, వాకింగ్ స్పేస్, స్విమింగ్ పూల్, యాంఫిథియేటర్, పెట్ పార్క్, ఇండోర్, ఔట్ డోర్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

This website uses cookies.