Categories: Celebrity Homes

రూ.కోటిన్నరతో ఆఫీస్ స్పేస్ కొన్న కంగనా

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముంబై అంధేరీలో రూ.1.56 కోట్లతో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేశారు. ఆర్క్ వన్ అనే భవనంలోని 19వ అంతస్తులో 407 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంది. చదరపు అడుగుకు రూ.38,391 ధర పడింది. ఆగస్టు 23న జరిగిన ఈ రిజిస్ట్రేషన్ కు స్టాంపు డ్యూటీ కింద 9.37 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30వేలు కంగనా చెల్లించారు.

చంద్రగుప్త ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆమె ఈ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన కంగనా రౌత్.. తన ఆస్తులను రూ.91 కోట్లుగా పేర్కొన్నారు.

This website uses cookies.