రాజీవ్​ స్వగృహ కోసం ఎదురుచూపు

  • అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు
  • ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఆన్​ లైన్​ వేలం ప్రక్రియ

హైదరాబాద్​ : హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్​ మీటింగ్స్’’​ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్​ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్​ను ఆన్​లైన్​ వేలం(ఈ–ఆక్షన్​) పద్దతిలో విక్రయాలకు పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్​–హైదరాబాద్​) రాజీవ్​ స్వగృహ టవర్స్​(అపార్ట్​ మెంట్స్​) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్​ సమావేశం జరిగింది.

అదేవిధంగా మేడ్చెల్​ మల్కాజ్​ గిరి జిల్లా పరిధిలోని బహదూర్​ పల్లి(దుండిగల్​ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మద్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్​ మీటింగ్​ ను హెచ్​ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్​ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డి, రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ చీఫ్​ ఇంజినీర్​ డాక్టర్​ ఎస్​.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్​ ఆఫీసర్​ గంగాధర్​, ఓఎస్డీ ఎం.రాంకిషన్​, సీజీఎం మాజీద్​ షరీఫ్​ లతో పాటు ఆన్​ లైన్​ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టిసి అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ చీఫ్​ ఇంజినీర్​ ఈశ్వరయ్య మాట్లాడుతూ నాగోల్​ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్​(అపార్ట్ ​మెంట్స్​)లతో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ నిర్మించిందని, వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించినట్లు తెలిపారు. మిగతా వాటిల్లో చాలా వరకు రెడీ టు ఆకుపై(నివాసానికి సిద్ధంగా) ఉన్నాయని చెప్పారు. 2008 సంవత్సరంలో ముంబాయికి చెందిన అర్కిటెక్చర్​ కంపెనీతో డిజైన్​ చేయించి నిర్మించిన ఇక్కడి అపార్ట్​ మెంట్​ జీహెచ్​ఎంసీ పరిధిలో అన్నిరకాల మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఖమ్మంలో…

ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్​ స్వగృహ కు సంబంధించిన ఎనిమిది(8) టవర్స్​(అపార్ట్​ మెంట్స్​) ప్రీబిడ్​ సమావేశం శుక్రవారం నాడు ఖమ్మం మున్సిపల్​ కమిషనర్​ ఆదర్శ్​ సురభి, హెచ్​ఎండిఏ సూపరింటెండెంటింగ్​ ఇంజినీర్​ యూసుఫ్​ హుస్సేన్​ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ లో జరిగిన ప్రీబిడ్​ సమావేశంలో కమిషనర్​ వేలం ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించారు. హెచ్​ఎండిఏ నిర్వహిస్తున్న బాధ్యతల గురించిన యూసుఫ్​ హుస్సేన్​ వివరించారు.

This website uses cookies.