Categories: LATEST UPDATES

ఎంఐజీ ప్లాట్ల కేటాయింపులకు లాటరీ

ఏపీలోని విజయనగరం జిల్లాలో అభివృద్ధి చేసిన రెండు ఎంఐజీ లేఔట్లలోని ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఇందుకోసం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) కంప్యూరైజ్డ్ లాటరీ నిర్వహించింది. వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ఎ.విజయ నిర్మల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు అందజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

This website uses cookies.