Categories: LATEST UPDATES

మహారాష్ట్ర రెరా చైర్మన్ గా మనోజ్ సౌనిక్

మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనోజ్ సౌనిక్ ఆ రాష్ట్ర రెరా కొత్త చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మహా రెరా చైర్మన్ గా ఉన్న 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అజోయ్ మెహతా 2021 ఫిబ్రవరిలో రెరా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న రిటైర్ కానున్నారు. అనంతరం మనోజ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి మనోజ్ సౌనిక్.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుజాతా సౌనిక్ భర్త.

This website uses cookies.